ఢిల్లీ-భోపాల్ మధ్య వందేభారత్ ఎక్స్ప్రెస్ను ప్రధాని మోదీ నేడు ప్రారంభించనున్నారు.భోపాల్-న్యూఢిల్లీ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును రాణి కమలాపతి స్టేషన్లో ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కంబైన్డ్ కమాండర్ల సదస్సులో కూడా మోదీ పాల్గొంటారని ప్రధాని కార్యాలయం తెలిపింది. ప్రధాని మోదీ శనివారం ఉదయం భోపాల్ చేరుకోనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3.15 గంటలకు రైలుకు పచ్చజెండా ఊపనున్నారు.ఈ రైలు 708 కిలోమీటర్ల ప్రయాణాన్ని కేవలం 7.45 గంటల్లో పూర్తి చేస్తుంది. ఈ రైలు గరిష్ట వేగం గంటకు 160 కి.మీ. ఈ రైలు భోపాల్లో ఉదయం 5.55 గంటలకు బయలుదేరి 11.40 గంటలకు ఆగ్రా చేరుకుంటుంది. మధ్యాహ్నం 1.45 గంటలకు ఢిల్లీ చేరుకుంటుంది.ఈ వందేభారత్ రైలు శనివారం మినహా ప్రతిరోజు నడుస్తుందని అధికారులు తెలిపారు. ఢిల్లీ-భోపాల్ మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఈరోజు ఏప్రిల్ 3 నుంచి రాకపోకలు సాగిస్తుందని అధికారులు తెలిపారు. సీట్ల రిజర్వేషన్ ఈరోజు నుంచి ప్రారంభంకానుంది.
కాగా.. వచ్చే మూడేళ్లలో 400 వందేభారత్ రైళ్లను నడపాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనిలో భాగంగా వందేభారత్ సర్వీసులను పెంచుతూ వస్తోంది. ఈ వందేభారత్ రైలుతో పదకొండు సర్వీసులు దేశంలో రాకపోకలు సాగించనున్నాయి. ఇప్పటివరకు కేంద్రం 10 రైళ్లను ప్రారంభించింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో అత్యాధునికమైన సౌకర్యాలు ఉన్నాయి. ఈ సెమీ హైస్పీడ్ రైలు గంటకు 160 కిలో మీటర్ల వేగంతో దూసుకుపోనుంది.