నవంబర్ నుంచి బిఎస్ ఎన్ ఎల్ 4జీ నెట్ వర్క్......
|
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బి ఎస్ ఎన్ ఎల్ నవంబర్ నుంచి తమ 4జీ నెట్ వర్క్ ను అందుబాటులోకి తేనుంది. వచ్చే ఏడాది ఆగష్టు నాటికి క్రమంగా దాన్ని 5జీకి అప్ గ్రేడ్ చేసుకోనుంది. ఇండియా మొబైల్ కాంగ్రెస్ లో పాల్గొన్న సందర్భంగా బిఎస్ ఎన్ ఎల్ సీఎండీ ప్.కె. పుర్వార్ ఈ విషయాలు తెలిపారు.18 నెలల్లో 1.25 లక్షలకు పైగా 4జీ మొబైల్ సైట్లను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు వివరించారు.దేశీ 4జీ టెక్నాలజీని వినియోగించేందుకు ఐటీ దిగ్గజం టీసీఎస్, ప్రభుత్వ రంగ టెలికం పరిశోదన సంస్థ సీ-డాట్ సారధ్యంలోని కన్సార్షియంతో చర్చలు జరుగుతున్నట్లు తెలిపారు.
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|